S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్వారీ, గ్రానైట్ యజమానులతో మైనింగ్ అధికారులు చర్చలు

విజయవాడ, డిసెంబర్ 6: క్వారీ, గ్రానైట్ యజమానులకు సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించే దిశగా మైనింగ్ అధికారులు చర్చలు జరిపారు. వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ్ధర్ మంగళవారం ముందుగా గ్రానైట్ సంస్థల యజమానులతో సమావేశమయ్యారు. డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ కింద తమ నుంచి 32 శాతం మేర వసూలు చేస్తున్నారని, దీనిని రద్దు చేయాలని వారు కోరారు. గ్రానైట్‌కు సంబంధించి రా మెటీరియల్‌పై పన్ను చెల్లించాల్సిన బాధ్యత క్వారీ యజమానులదేనని తెలిపారు. కానీ తాము చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. ఫనిష్డ్ ప్రోడక్టుకు మాత్రమే తాము పన్ను చెల్లించాల్సి ఉందని తెలిపారు.

గురుకుల పాఠశాలలో దారుణం

ఆళ్లగడ్డ, డిసెంబర్ 6: గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధిని గర్భం దాల్చిన సంఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం ఆ చిన్నారికి 5వ నెల. దీంతో ఆసపత్రిలో చేరింది. వివరాల్లోకి వెళ్తే రుద్రవరం మండలం పెద్దకంబలూరుకు చెందిన ఓ విద్యార్థిని ఆళ్లగడ్డలోని గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఈనెల 2వ తేదీ ఆ విద్యార్థిని తనకు చూపు సరిగా కనబడడం లేదని ఉపాధ్యాయులకు తెలియజేయడంతో పాఠశాల సిబ్బంది వైద్యపరీక్షలు చేయించి మందులు ఇచ్చి పంపించారు. అయినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో బాలిక విషయాన్ని తండ్రికి తెలియజేశారు. దీంతో తండ్రి వచ్చి కూతురును ఇంటికి తీసుకువెళ్లాడు.

పొంచివున్న తుపాను ముప్పు!

విశాఖపట్నం, డిసెంబర్ 6: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలోపేతం కానుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. వాయుగుండం ప్రస్తుతం విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. ఇది వాయవ్య దిశగా కదులుతూ రేపటికి తీవ్ర వాయుగుండంగాను, తరువాత 48 గంటల్లో తుపానుగాను ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనావేస్తున్నారు. ఇదిలా ఉండగా తీవ్ర వాయుగుండం తదుపరి తుపానుగా మారే అవకాశాలు మెండుగా ఉన్నట్టు వాతావరణ నిపుణులు అంచనావేస్తున్నారు.

నేడు మరిన్ని డబ్బులు వస్తున్నాయ్

విజయవాడ, డిసెంబర్ 6: పెద్దనోట్ల రద్దీ ఇబ్బందులను తొలగించేందుకు గాను బుధవారం మరో రూ.1100 కోట్లు నగదు రాష్ట్రానికి రానున్నదని ఆపై దశలవారీగా రూ.50, రూ.20ల చిన్న నోట్లు కూడా త్వరలో రానున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇటీవల వచ్చిన రూ.2400 కోట్ల నగదు వల్ల చాలా వరకు ఒత్తిడి అధిగమించామన్నారు. పెద్ద నోట్లు రద్దు చేసి 27 రోజులు గడుస్తున్నా వాస్తవానికి సంక్షోభం పరిష్కారం కాలేదు కానీ ఒత్తిడి మాత్రం కొంతమేర తగ్గించగలిగామని చంద్రబాబు అన్నారు. మంగళవారం బ్యాంకర్లు, ఆర్ధికశాఖ అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

తెలంగాణ ముఖ్య సలహాదారుగా రాజీవ్ శర్మ బాధ్యతలు

హైదరాబాద్, డిసెంబర్ 6: ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా రాజీవ్ శర్మ మంగళవారం తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన రాజీవ్ శర్మను ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సమతా బ్లాక్)లో రాజీవ్ శర్మ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చాంబర్‌లో వేద పండితులు పూజలు నిర్వహించిన అనంతరం రాజీవ్ శర్మ అధికారికంగా విధులు చేపట్టారు.

చిత్రం..తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరిస్తున్న రాజీవ్ శర్మ

నరుూం ముఠా సభ్యుల అరెస్టు

సిద్దిపేట, డిసెంబర్ 6: భూవివాదాల్లో తలదూర్చి నరుూంముఠా పేరిట బెదిరింపులు చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సిద్దిపేట ఎసిపి నర్సింహారెడ్డి వెల్లడించారు. రియల్టర్లను బెదిరించి బ్లాక్‌మెయిల్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం తన చాంబర్‌లో విలేఖరులతో మాట్లాడారు. అంబేద్కర్‌నగర్‌కు చెందిన బత్తుల చంద్రం 1996-97లో దుబ్బాక దళంలో మావోయిస్టుగా పనిచేశాడని, 1999లో అరెస్టైనట్లు తెలిపారు. అనంతరం సిద్దిపేట మున్సిపల్, ఎమ్మెల్యే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా, ఎన్టీఆర్ టిడిపి అభ్యర్థిగా బరిలో నిలిచాడన్నారు.

నేడే నింగిలోకి పిఎస్‌ఎల్‌వి-సి 36

సూళ్లూరుపేట, డిసెంబరు 6: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో స్వదేశీ ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి బుధవారం ఉదయం 10:25గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 36 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ సోమవారం రాత్రి 10:25గంటలకు ప్రారంభమై నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఇస్రో చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్ మంగళవారం షార్‌కు చేరుకున్నారు.

కొత్త భవనాలకు ‘పెద్దనోట్ల’ గ్రహణం

హైదరాబాద్, డిసెంబర్ 6: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త జిల్లా కేంద్రాల్లో ‘కార్యాలయ భవనాల సముదాయా’లను నిర్మించాలని రూపొందించిన ప్రణాళికకు గ్రహణం పట్టింది. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఏర్పడ్డ పరిస్థితులే ఇందుకు కారణమని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రతి జిల్లా కేంద్రంలోనూ కనీసం వంద కోట్ల రూపాయలతో జిల్లా కార్యాలయ భవనాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని ప్రతిపాదించారు. ఒక్కో జిల్లాలో సరాసరిన లక్షాయాభైవేల చదరపు అడుగుల వైశాల్యంతో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించాలని ప్రతిపాదించారు.

డిజిటల్ తెలంగాణ

హైదరాబాద్, డిసెంబర్ 6: గత ఐదు రోజుల్లో అత్యధికంగా డిజిటల్ ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని సిఎం కె చంద్రశేఖర్‌రావు అన్నారు. సాధ్యమైనంత త్వరగా తెలంగాణను పూర్తిస్థాయి డిజిటల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సిఎం వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలను డిజిటలైజ్ చేసే ప్రక్రియలో సహకరించేందుకు దిగ్గజ బ్యాంకు ఐసిఐసిఐ ముందుకొచ్చింది. ఈమేరకు బ్యాంకు ఉన్నతాధికారులు సిఎం కెసిఆర్‌తో మంగళవారం ప్రగతిభవన్‌లో సమావేశమై డిజిటల్ బ్యాంకింగ్ సేవలు తమ బ్యాంకు తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు.

ఉగాదికే అవార్డులు

ఎన్టీఆర్, పైడి జయరాజ్, రఘుపతి వెంకయ్య, కాంతారావు, ప్రభాకర్‌రెడ్డి, సరోజినీనాయుడు పేర్లతో
సినీ అవార్డులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది.

Pages