S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందుపాతర్లతో మావోల విధ్వంసం

భద్రాచలం, డిసెంబర్ 6: పిఎల్‌జిఏ వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు మంగళవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భద్రతా బలగాలపై మందుపాతర్లతో విరుచుకుపడ్డారు. దంతెవాడ జిల్లాలో హెడ్‌కానిస్టేబుల్ ఒకరు మృతి చెందగా, నారాయణ్‌పూర్ జిల్లాలో మాత్రం పోలీసులు ఎదురుదాడి చేయడంతో అడవుల్లోకి పారిపోయారు. ఉదయం దంతెవాడ జిల్లా అరన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండపార-కొండాసవలి మధ్య రహదారి నిర్మాణానికి సిఆర్‌పిఎఫ్ 231 బెటాలియన్‌కు చెందిన జవాన్లు పహారా కాయడానికి వెళ్లారు. పహారాకు జవాన్లు వస్తారని ముందుగానే ఊహించిన మావోయిస్టులు సోమవారం రాత్రే మందుపాతరను అమర్చారు.

అడుగంటుతున్న తుంగభద్ర

అనంతపురం, డిసెంబర్ 6: కర్ణాటక, ఆంధ్ర రైతుల జీవనాధారమైన తుంగభద్ర జలాశయం త్వరలో డెడ్ స్టోరేజీకి చేరుకోనుంది. మంగళవారం నాటికి జలాశయంలో కేవలం 9.6 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉంది. జలాశయం నీటిమట్టం 7.5 టిఎంసిల దిగవకు చేరుకోనేగా డెడ్‌స్టోరేజిగా ప్రకటిస్తారు. జలాశయంలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో సీమలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు నీరందే పరిస్థితి లేకుండా పోయింది. నెలన్నర క్రితమే హెచ్చెల్సీకి నీటి సరఫరా నిలిచిపోయింది. అప్పటికే హెచ్చెల్సీ ద్వారా అనంతపురం జిల్లాలోని పిఎబిఆర్‌కు 10.75 టిఎంసిల నీటిని తరలించి నిల్వ చేశారు.

డాక్‌యార్డ్‌లోకి అనుమానితులు?

విశాఖపట్నం, డిసెంబర్ 6: అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన తూర్పు నౌకాదళం ఆధీనంలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ఇద్దరు యువకుల అనుమాన స్పద సంచారం ఉత్కంఠత రేకెత్తించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కట్టుదిట్టమైన భద్రత కలిగిన నేవల్ డాక్‌యార్డ్‌లో నిషేధిత ప్రాంతంలోకి సోమవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించినట్టు నేవీ అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన నేవీ అధికారులు సిసి టివి పుటేజీని పరిశీలించారు. ఇద్దరు యువకులు డాక్‌యార్డ్‌లోకి ప్రవేశించినట్టు నిర్ధారించుకున్న మీదట గాలింపు మొదలు పెట్టారు. డాక్‌యార్డ్‌లో నిషేధిత ప్రాంతాలను అణువణువునా గాలించారు.

కరెంటు చౌర్యంలో కడప, అనంత టాప్

విజయవాడ (క్రైం), డిసెంబర్ 6: విద్యుత్ చౌర్యంలో కడప, అనంతపురం జిల్లాలు మొదటి స్థానంలో ఉన్నాయి. గడిచిన ఏప్రిల్ నుంచి అక్టోబర్ మాసాంతానికి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలోని ఎనిమిది జిల్లాల్లో విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో 26వేల 500 కేసులు నమోదయ్యాయి. విద్యుత్ చౌర్యానికి పాల్పడటంతోపాటు ఇతరత్రా కూడా నష్టం కలుగచేసిన కేసుల్లో సుమారు 16కోట్ల రూపాయలు అపరాధ రుసుము వసూలు చేసినట్లు ఏపిఎస్‌పిడిఎస్‌ఎల్ విజిలెన్స్ ఎస్‌ఇ బి.రవి తెలిపారు. విజయవాడలోని టాన్స్‌కో కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత ఏడాదితో పాలిస్తే..

అర్చకుల సమస్యలపై సమావేశాలు

హైదరాబాద్, డిసెంబర్ 6: అర్చకుల సమస్యలను పరిష్కరించేందుకు ‘అర్చక గ్రీవెన్స్’ సమావేశాలు మూడు ప్రాంతాల్లో నిర్వహించాలని ఎపి దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేవాదాయ కమిషనర్ వైవి అనూరాధ పేరుతో ఇటీవలే ఒక మెమో జారీ అయింది. ఈ నెల 15 న విజయవాడలో జరిగే సమావేశంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన అర్చకులు పాల్గొనేందుకు అవకాశం ఇచ్చారు. అలాగే ఈ నెల 20 న విశాఖపట్నంలో జరిగే సమావేశానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాలకు చెందిన అర్చకులు పాల్గొనాల్సి ఉంది.

నేడు రాష్ట్ర స్పోర్ట్స్ పాలసీపై చర్చ

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 6: ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఆధ్వర్యంలో రాష్ట్రంలోక్రీడలను మరింతగా అభివృద్ధి చేసేందుకు గాను ప్రత్యేక ప్రణాళికను ఏర్పాటు చేయనున్నట్లు శాప్ వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బంగారరాజు తెలిపారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని శాప్ కార్యాలయంలో విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్రీడా ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందని, అందరి అభిప్రాయాలు తీసుకోవాలని సిఎం సూచించినట్లు పేర్కొన్నారు. ఈక్రమంలో బుధవారం డివిమానర్ హోటల్‌లో క్రీడా పాలసీపై చర్చ నిర్వహించినట్లు తెలిపారు.

జయ మృతితో బాబు దిగ్భ్రాంతి

విజయవాడ, డిసెంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అకాల మరణం తనకొక షాక్ లాంటిదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జయలలిత మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆమె ఆత్మకు శాంతి కలగాలని రాష్ట్ర సచివాలయం సంతాపం తెలిపింది. సంతాప సూచకంగా ఉద్యోగులు రెండు నిమిషాలు వౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు.. జయలలిత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయ జీవితంలో అనేక పోరాటాలు చేశారని, అన్ని పోరాటాల్లో విజయం సాధించారని, 75 రోజులపాటు మృత్యువుతో పోరాడారని, ఆమె మృతి చెందడం చాలా బాధగా వుందని అన్నారు.

డేటా సెంటర్ ఏర్పాటుకు జపాన్ సంస్థ సహకారం

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 6: రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నగరంలో ప్రపంచ స్థాయి డేటా సెంటర్‌ను స్థాపించేందుకు జపాన్ సంస్థ ఇంటర్నెట్ ఇన్ఫో వెటివ్ జపాన్ (ఐఐజె) సన్నాహాలు చేస్తోంది. ఈసందర్భంగా మంగళవారం ఉదయం నగరంలో కేదరేశ్వరపేటలోని అమరావతి అభివృద్ధి సంస్థ (ఎడిసి) కార్యాలయంలో చైర్ పర్సన్ డి లక్ష్మీ పార్ధసారథి తో జపాన్ సంస్థ ప్రతినిధులతో జరిపిన చర్చల్లో ఐఐజె సంస్థ అసిస్టెంట్ మేనేజర్ యూకో కజ్జామ రాజధానిలో ఆధునిక ప్రమాణాలతో నిర్మించనున్న డేటా సెంటర్, దాని అవశ్యకత పై సమీక్షించారు.

వౌలిక సదుపాయాలకు రూ. 1,275 కోట్ల హడ్కో రుణం

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 6: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఇక వేగవంతం కానున్నాయి. రాజధానిలో వౌలిక సదుపాయాల కల్పనకు గాను హడ్కో సంస్థ తొలి విడతగా 1,275 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈసందర్భంగా మంగళవారం ఉదయం హడ్కో రుణ మంజూరు పత్రాన్ని అ సంస్థ ప్రాంతీయ ముఖ్య అధికారి ఎల్‌విఎస్ సుధాకర్ బాబు సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్‌కు అందజేసారు. రాజధాని నిర్మాణానికి గాను హడ్కో మొత్తం 7వేల 500 కోట్ల రూపాయలను రుణం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొనగా ఇందులో భాగంగా తొలివిడతగా వెయ్యి 275 కోట్లను మంజూరు చేసినట్టు తెలిపారు.

పెట్రోల్‌బంకులు, రేషన్ దుకాణాల్లో నగదురహిత విధానాన్ని ప్రోత్సహించాలి

మేడ్చల్, డిసెంబర్ 6: మేడ్చల్ మండలంలోని పెట్రోల్‌బంకుల నిర్వాహకులు, రేషన్ డీలర్‌లు, వంటగ్యాస్ ఏజెన్సీల్లో నగదు రహిత విధానాన్ని ప్రొత్సాహించాలని జిల్లా సహయ పౌరసరఫరాల అధికారి ప్రేమ్‌కుమార్ సూచించారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో పలువురు డీలర్‌లతో నగదు రహిత విధానం అమలుపై సమావేశం నిర్వహించారు. క్యాష్‌లెస్ విధానాన్ని అమలు చేసే విధంగా డీలర్లు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. ప్రెటోల్ బంకుల వద్ద ఇంధనం కోసం వచ్చే కస్టమర్ల వద్ద క్రెడిట్ లేదా డెబిట్ కార్డులున్నచో నగదు రహిత విధానం మేరకు కార్డులపైనే ప్రెటోల్, డిజిల్ సరఫరా చేయాలని సూచించారు.

Pages