మందుపాతర్లతో మావోల విధ్వంసం
Published Wednesday, 7 December 2016భద్రాచలం, డిసెంబర్ 6: పిఎల్జిఏ వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు మంగళవారం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భద్రతా బలగాలపై మందుపాతర్లతో విరుచుకుపడ్డారు. దంతెవాడ జిల్లాలో హెడ్కానిస్టేబుల్ ఒకరు మృతి చెందగా, నారాయణ్పూర్ జిల్లాలో మాత్రం పోలీసులు ఎదురుదాడి చేయడంతో అడవుల్లోకి పారిపోయారు. ఉదయం దంతెవాడ జిల్లా అరన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొండపార-కొండాసవలి మధ్య రహదారి నిర్మాణానికి సిఆర్పిఎఫ్ 231 బెటాలియన్కు చెందిన జవాన్లు పహారా కాయడానికి వెళ్లారు. పహారాకు జవాన్లు వస్తారని ముందుగానే ఊహించిన మావోయిస్టులు సోమవారం రాత్రే మందుపాతరను అమర్చారు.