విజయవాడకు రైళ్ల రాకపోకలు బంద్
Published Saturday, 24 September 2016విజయవాడ, సెప్టెంబర్ 23: దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో విజయవాడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న రూట్ రిలే ఇంటర్ లాకింగ్ పనులు రాత్రి, పగలు శరవేగంతో ముందుకు సాగుతున్నాయి. గురువారం వరకు పాక్షికంగా మూడు ప్లాట్ఫారాల్లో రైళ్ల రాకపోకలు సాగగా శుక్రవారం అన్ని ప్లాట్ఫారాల్లోను రైళ్ల రాకపోకలను నిలిపివేసి శరవేగంగా పనులు నిర్వహించారు. ఒకటి నుంచి 5వ నెంబర్ ప్లాట్ఫారం వరకు క్రాస్ ఓవర్ పాయింట్లను తొలగించి కొత్తవాటిని ఏర్పాటుచేసారు. దీనికి సంబంధించిన సిగ్నల్ పాయింట్లను అధికారులు తనిఖీ చేసారు. దాదాపు 2వేల మంది కార్మికులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు.