ప్రభుత్వానికి ప్రతిపక్షాల బాసట!
Published Saturday, 24 September 2016హైదరాబాద్, సెప్టెంబర్ 23: ప్రకృతి కనె్నర్ర చేయడంతో ప్రజలను ఆదుకునేందుకు ప్రతిపక్షాలన్నీ నడుం బిగించాయి. సహాయక కార్యక్రమాల్లో ముందుండాలని పార్టీ అగ్ర నాయకులు తమ పార్టీల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వర్షం, వరద బాధితులను ఆదుకునేందుకు సహాయక కార్యక్రమాల్లో ముందుండాలని తెలుగు దేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం వారు జిల్లా పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.