వేడిలో కాదు..వేడిగా!
Published Saturday, 24 September 2016విశాఖపట్నం, సెప్టెంబర్ 23: రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేక హోదా పదేళ్లు ఇవ్వాలని వేడిలో తాను అన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తిప్పికొట్టారు. విశాఖలో మూడు రోజులపాటు జరిగే ఇండియా, ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన అంశంపై చట్టసభలో చోటుచేసుకున్న పరిణామాలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయని, పరిస్థితి వేడిగా ఉన్నప్పుడే ఎపికి ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో చేర్చి ఉంటే ఇప్పుడీ పరిస్థితి తలెత్తేది కాదన్నది తన ఉద్దేశంగా పేర్కొన్నారు. తన అభిప్రాయాన్ని కొన్ని పత్రికలు వక్రీకరించాయన్నారు.