బండారి లే అవుట్ కాలనీలో మంత్రి జూపల్లి పర్యటన
Published Saturday, 24 September 2016జీడిమెట్ల: నిజాంపేట్ గ్రామం, బండారి లే అవుట్ కాలనీలో రాష్ట్ర మంతి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్లు శుక్రవారం పర్యటించారు. కాలనీలో వరద నీటిలోనే పాదయాత్రలో బాధితులను పరామర్శించారు. బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కాలనీకి ఆనుకున్న ఉన్న తుర్కచెరువును పరిశీలించారు. జూపల్లి మాట్లాడుతూ బాధితులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, భయాందోళనకు గురికాకూడదని సూచించారు. కాలనీకి ఎలాంటి ప్రమాదం లేదని, వర్షం ఎక్కువగా ఉన్నందున ఇన్ఫ్లో ఉందని తెలిపారు. ప్రభుత్వ పరంగా బాధితులకు అన్ని సదుపాయాలను సమకూరుస్తున్నామని అన్నారు.