భారత్-పాక్ స్నేహవారధి సింధూ జల ఒప్పందం
Published Saturday, 24 September 2016ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 23: భారత్, పాకిస్తాన్ల మధ్య ఇప్పటివరకు రెండు యుద్ధాలు జరిగాయి. రెండు దేశాలు దాయాదుల్లాగా నిత్యం ఏదో ఒక విషయంపై గొడవ పడుతూనే వస్తున్నాయి. రెండు దేశాల మధ్య 50 ఏళ్లుగా కాశ్మీర్ వివాదం రావణ కాష్ఠంలాగా కాలుతూనే ఉంది. అయితే ఒక్క విషయంలో మాత్రం రెండు దేశాల మధ్య ఇప్పటివరకు ఎలాంటి పొరపొచ్చాలు తలెత్తలేదు. అదే సింధూ జలాల ఒప్పందం. 56 ఏళ్ల క్రితం కుదిరిన ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య స్నేహవారధిగా కొనసాగుతోంది. నిజానికి సింధూ జల ఒప్పందం పాకిస్తాన్కు జీవనాడి. ఈ ఒప్పందం ప్రకారం, సింధూనది, దాని అయిదు ఉపనదుల నీటిని రెండు దేశాలు పంచుకుంటున్నాయి.