జంట జలాశయాల్లో పెరిగిన నీటి మట్టం
Published Saturday, 24 September 2016నార్సింగి, సెప్టెంబర్ 23: గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరానికి అందించే జంట జలాశయాలల్లో భారీగానే వరద నీరు వచ్చి చేరింది. మునుపెన్నడు రాని విధంగా ఒక్కరోజు కురుసిన వర్షానికే జంట జలాశయాలల్లో భారీగా వరద నీరు వచ్చింది. కొన్ని నెలలుగా పూర్తిగా ఎండిపోయిన జంట జలాశయాలల్లో కొత్తగా నీరు రావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. మరో రెండు, మూడు రోజులు పాటు ఇదేవిధంగా భారీ వర్షాలు కురిస్తే జంట జలాశయాలు నిండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జలమండలి అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావారణం శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తున్నా విషయం తెలిసిందే.