స్మార్ట్సిటీపై కబ్జాదారుల పడగ!
Published Wednesday, 31 August 2016విశాఖపట్నం, ఆగస్టు 30: ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం ఇపుడు స్మార్సిటీగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్మార్ట్సిటీలో విశాఖపట్నం ఒకటి. ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ, విశాఖ నగరాలకే ఈ అవకాశం దక్కింది. అయితే చెప్పుకునేందుకు ఇది గర్వంగానే ఉన్నా, ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి ఇపుడు భూ కబ్జాలు శాపంగా మారుతున్నాయి. స్థలాల ఆక్రమణు, ల్యాండ్ మాఫియా చేతుల్లోకి రెవెన్యూ భూములు వెళ్ళిపోతున్న సంఘటనలు, పెరిగిపోతున్న కబ్జాల గోలతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి.