కాబూల్లో భారతీయ మహిళ కిడ్నాప్
Published Saturday, 11 June 2016న్యూఢిల్లీ/కోల్కతా, జూన్ 10: అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న భారతీయ మహిళను కాబూల్లో అనుమానిత ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. కోల్కతాకు చెందిన జుదిత్ డిసౌజా కాబూల్లో ఆగాఖాన్ ఫౌండేషన్ సంస్థలో సీనియర్ సాంకేతిక సలహాదారుగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం ఆఫీసు బయట జుదిత్తో పాటు సెక్యూరిటీ గార్డు, డ్రైవర్ను కిడ్నాప్ చేశారు. కాబూల్ నడిబొడ్డున తైమని ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరో వారం రోజుల్లో భారత్కు తిరిగిరావాల్సిన జుదిత్ కిడ్నాప్కు గురికావడంతో కోల్కతాలోని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.