ప్రొ-క్యారమ్స్ లోగో ఆవిష్కరణ
Published Saturday, 11 June 2016విశాఖపట్నం (స్పోర్ట్స్), జూన్ 10: అఖిల భారత క్యారమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ప్రొ క్యారమ్స్ లీగ్ లోగోను మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం విశాఖలో ఆవిష్కరించారు. ఈ లీగ్లో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను ఆక్షన్ద్వారా ఆరు జట్లను ఎంపిక చేసుకున్నాయి. ఇప్పటికే అయిదు జట్ల ఎంపిక జరిగిపోయింది. ఇంకా మిగిలిన ఒక జట్టు యుఎస్కు సంబంధించినది కాగా దానిని కూడా భారతీయులే స్పాన్సర్ చేస్తున్నారని సమాఖ్య అధ్యక్షుడు నీరజ్కుమార్ సంపత్ శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ప్రతి జట్టులో ఐదుగురు క్రీడాకారులు, కోచ్, మేనేజర్ ఉంటారన్నారు.