రాష్ట్ర ప్రభుత్వ కమిటీలో అంగరకు స్థానం
Published Saturday, 11 June 2016పాలకొల్లు, జూన్ 10: మహిళా, శిశువు, మానసిక వికలాంగులు, వృద్ధుల అభివృద్ధి కమిటీలో సభ్యునిగా ప్రభుత్వ విప్ అంగర రామమోహన్ను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వికలాంగులకు పూర్తి రక్షణ కల్పించే ఈ కమిటీ మూడు సంవత్సరాలు అమలులో ఉంటుంది. ప్రతి ఆరు మాసాలకు తప్పనిసరిగా ఈ కమిటీ సమావేశం జరిపి జరుగుతున్న పనులను సమీక్షిస్తుంది. దీనికి ఈ శాఖ మంత్రి ఛైర్పర్సన్గా ఉంటారు.