కాపులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి
Published Saturday, 11 June 2016విజయనగరం(టౌన్), జూన్ 10: తుని ఘటనలో బాధ్యులుగా భావించి అరెస్టుచేసిన కాపునాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని జిల్లా తెలగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చనమల్లు ప్రసాదరావు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమేనని అయితే ముద్రగడ దీక్ష సందర్భంలో త్రిమెన్ కమిటీ ఇచ్చిన హామీ మేరకు కేసులు పెట్టమని చెప్పిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథన్ కమిటీ ఇంతవరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన చేయలేదన్నారు.