నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు
Published Saturday, 11 June 2016పాయకాపురం, జూన్ 10: తమ పార్టీకి చెందిన మహిళా కార్పొరేటర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బొండా ఉమకు సిగ్గుంటే తక్షణమే కార్పొరేటర్ అవుతు శ్రీ శైలజకు క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు వంగవీటి రాధకృష్ణ డిమండ్ చేశారు. 59వ డివిజన్ కండ్రికలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడుతూ ఇళ్ల విషయమై 59వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అవుతు శ్రీ శైలజ ఎమ్మెల్యేను ప్రశ్నించగా ఆమెను ఏకవచనంతో సంభోదించడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి తగదన్నారు.