పరిశ్రమల స్థాపనకు అనుమతులివ్వాలి
Published Saturday, 11 June 2016అనంతపురం సిటీ, జూన్ 10:జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులను ఆలసత్వం లేకుండా వెంటనే మంజూరు చేయాలని జెసి బి.లక్ష్మికాంతం అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీని కాన్ఫరెన్సు హాల్లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీయల్ ప్రమోషన్ కమిటీ జెసి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయంతో పాటు పరిశ్రమలను ఫ్రోత్సహించాలని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవసరమైన అన్నివసతులను సింగల్ విండో పద్దతిలో మంజూరు చేయాలన్నారు.