పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
Published Saturday, 11 June 2016శామీర్పేట, జూన్ 10: ప్రధానమంత్రి పంటల బీమా పథకం, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు తెలిపారు. ఖరీఫ్ సీజన్లో ప్రధానమంత్రి పంటల బీమా పథకానికి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర్లు, మినుములు, వేరుశేనగ, పసుపు పంటలకు ఈ బీమా పథకం వర్తించనుందని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో మొక్కజొన్న పంటను గ్రామం యూనిట్గా వరి, జొన్న కంది, పెసర, మినుము, పసుపు పంటలను మండలం యూనిట్గా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.