పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
Published Saturday, 11 June 2016గచ్చిబౌలి, జూన్ 10: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ప్రారంభమైన మాదిగ విద్యార్థుల చైతన్య సైకిల్ యాత్రను ప్రారంభించారు. తెలంగాణ శాసనసభ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించినా ప్రయత్నాలు చేయలేదని అన్నారు. అఖిలపక్షాన్ని సిఎం కేసిఆర్.. ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. అధికారం లేని సమయంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన బిజెపి.. ఇప్పుడు నిజాయాతీని నిలబెట్టుకోవాలని అన్నారు.