హలాలన్నీ పొలాల వైపే..!
Published Saturday, 11 June 2016ఎల్లారెడ్డిపేట, జూన్ 10: ఖరీఫ్ సీజన్కు కర్షకులు శ్రీకారం చుట్టారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో 12వేల హెక్టార్ల సాగు భూమి ఉంది. పైగా రైతులు ప్రతి యేటా 9.5వేల హెక్టార్ల వరకు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడం కారణంగా అధిక శాతం వర్షాభావ పంటలే సాగు చేస్తున్నారు. వర్షం పడగానే విత్తు నాటేందుకు రైతులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. పెరిగిన ధరల కారణంగా గత ఏడాది కంటే ఈసారి హెక్టారుకు పాతిక శాతం పెట్టుబడులు అధికం కానున్నాయని రైతులు పేర్కొంటున్నారు.