రెండో రోజుకు ముద్రగడ దీక్ష
Published Saturday, 11 June 2016రాజమహేంద్రవరం, జూన్ 10: కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో కొనసాగిస్తున్న దీక్ష శుక్రవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. కిర్లంపూడిలో ఆమరణ దీక్షను భగ్నం చేసిన అనంతరం ముద్రగడను పోలీసులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించిన నేపథ్యంలో అక్కడ వైద్య పరీక్షలను నిరాకరించారు. ఆసుపత్రిలో వైద్యులు ఎంత నచ్చజెప్పినప్పటికీ ముద్రగడ అంగీకరించలేదు. దీంతో అతికష్టం మీద రక్త పరీక్ష నిర్వహించారు. సుగర్ లెవెల్స్ తగ్గుతున్నట్టు శుక్రవారం వైద్యులు ధ్రువీకరించారు.