ఉద్యోగ నేతల్లో చీలిక చిచ్చు?
Published Saturday, 11 June 2016హైదరాబాద్, జూన్ 10:సచివాలయం తరలింపువ్యవహారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతల మధ్య చిచ్చుకు కారణమవుతోంది. తరలింపును కనీసం ఆరునెలల వరకూ వాయిదా వేయాలని సచివాలయ గెజిటెడ్ అధికారుల సంఘం కోరుతుండగా, నిర్ణీత గడువులోగా ఉద్యోగులు వస్తారని ఏపి ఎన్జీఓ నేత అశోక్బాబు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ చెబుతున్నారు.