కోనసీమలో బంద్ పాక్షికం
Published Saturday, 11 June 2016అమలాపురం, జూన్ 10: ముద్రగడ దీక్ష భగ్నం కారణంగా టిబికె జెఎసి ఇచ్చిన పిలుపుమేరకు కోనసీమలో బంద్ పాక్షికంగా జరిగింది. శుక్రవారం ఉదయం కొద్దిగా బంద్ ప్రభావం కనిపించినా అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలు యధావిధిగా సాగాయి. బస్సులు, ఆటోలు యధావిధిగా తిరిగాయి. అయితే ముమ్మిడివరం, కొత్తపేట, పి గన్నవరం మండలాల్లో బంద్ ప్రభావం కనిపించింది. అమలాపురంలో బంద్ పాక్షికంగా జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేశాయి. ఆర్టీసీ బస్సులను నడిపారు. అయితే అమలాపురం పట్టణంలో కొంతమంది తమ షాపులను స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు సహకరించగా మరికొంతమంది తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగించుకున్నారు.