S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

25వేల రియాల్స్‌కు నన్ను అమ్మేశారు

హైదరాబాద్, జూన్ 10: పేదరికం ఆమె పాలిట శాపమైంది. భర్త ఆకస్మిక మరణంతో రోడ్డున పడిన కుటుంబాన్ని పోషించుకోవటం కోసం పరిచయస్తులను ఆశ్రయిస్తే ఏకంగా సౌదీ అరేబియాకు అమ్మేశారంటూ నగరానికి చెందిన బాధిత మహిళ కంట తడిపెట్టింది. సౌదీ అరేబియాలో కుట్టు, ఎంబ్రాయిడరీ, మెహందీ.. ఇలా ఇతర పనుల కోసం సౌదీ అరేబియా వెళ్లిన 18మంది మహిళలను అక్కడ షేక్‌ల వేధింపులకు గురి చేశారు. షేక్‌ల వేధింపుల నుంచి చాకచాక్యంగా తప్పించుకుని భారత రాయబార కార్యాలయం సహకారంతో స్వదేశానికి చేరుకున్నారు బాధిత మహిళలు.

బూందీ తయారీ పోటులో అగ్నిప్రమాదం

తిరుమల, జూన్ 10: తిరుమలలో లడ్డూలు తయారుచేసేందుకు టిటిడి యాజమాన్యం శ్రీవారి ఆలయం వెలుపల ఏర్పాటుచేసిన అదనపు పోటులో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో బూందీ తయారీ చేసే ప్రాంతంలో అగ్నిమంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న టిటిడి ఇ ఓ డాక్టర్ సాంబశివరావు, జెయి ఓ శ్రీనివాసరాజులు ముందుగా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను ఆరాతీశారు. కాగా టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తికూడా ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఇఓ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

స్థానికతకు ఓకే

న్యూఢిల్లీ, జూన్ 10: తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి స్థిర పడేవారికి స్థానికత కల్పించేందుకు ఉద్దేశించిన రాజపత్రాన్ని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గత రాత్రి జారీ చేశారు. 2014 జూన్ రెండో నుంచి 2017 జూన్ రెండో తేదీ మధ్యకాలంలో తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడే వారికి స్థానిక కల్పించేందుకు రాష్టప్రతి ఉత్తర్వులు వీలు కల్పిస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డి)లోని క్లాజ్ 1, 2 ప్రకారం రాష్టప్రతికి ఉన్న అధికారం మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల నిర్వహణ, ప్రవేశ చట్టం 1974 చట్టంలోని నాల్గవ పేరాగ్రాఫ్‌ను సవరించారు.

పశ్చిమాన జోరందుకున్న ఏరువాక

*తొలకరి పలకరింపు పుడమితల్లి పులకింత
*కోటి ఆశలతో పడమటి కరవురైతు ఖరీఫ్‌సాగు
‘‘ఎదురుచూస్తున్న ఏరువాక రానే వచ్చింది... ఏరువాకతోపాటే తొలకరి పలకరించింది...తొలకరి పలకరింపుతో పుడమితల్లి పులకించింది... పచ్చపచ్చని ప్రతిఆకూ... పసందైన కథ వినిపిస్తోంది... కొమ్మరెమ్మల్లో దాగిన కోయిల ఆ‘పాట’లే ఆలపిస్తోంది..’’

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ

గంగాధరనెల్లూరు, జూన్ 10: మండల కేంద్రంలోని తూగుండ్రం రోడ్డు వద్ద శుక్రవారం ఆగివున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొన్న ఘటనలో వినోద్‌కుమార్(20) అనే యువకుడు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలైన సంఘటన జరిగింది. స్థానిక ఎస్సై విశ్వనాథరెడ్డి కథనం మేరకు వేపంజేరి నుంచి చిత్తూరు వైపు ఇటుకలు తరలిస్తున్న ట్రాక్టర్‌ను వెనుక వైపు నుంచి గ్రానైట్ రాయిని తరలిస్తున్న లారీ ఢీకొనడంతో వేపంజేరి దళిత వాడకు చెందిన హరి కుమారుడు వినోద్‌కుమార్(20) మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన ప్రమీల(22), బాలకృష్ణ(19), సురేంద్రకుమార్ (20)లకు గాయాలైయ్యాయన్నారు.

నేటి నుండి ఉద్యోగుల బదిలీలు

హైదరాబాద్, జూన్ 10: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల బదిలీలకు వీలు కల్పిస్తూ, ప్రస్తుతం బదిలీలపై కొనసాగుతున్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. నిషేధం ఎత్తివేత శనివారంనుంచి 20వ తేదీ వరకూ అమలులో ఉంటుందని ఆర్ధిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజేయకల్లం చెప్పారు. ఈ మేరకు ఆయన జీవో 102 జారీ చేశారు. జూన్ 1 నాటికి కనీసం మూడేళ్లు దాటిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని, ఒకే స్థానంలో ఐదేళ్లుగా కొనసాగుతున్న వారిని బదిలీ చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఐటిడిఎ ప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బంది రెండేళ్లు పూర్తయితే దరఖాస్తు కోరవచ్చని అన్నారు.

కపిల గోవుకు పురాణ పండితుల పూజలు

తిరుపతి, జూన్ 10: తమ కోర్కెలను తీరాలని కోరుతూ టిటిడి పరిపాలనాభవనం ముందు గత 12 రోజులుగా దీక్షలు చేస్తున్న పురాణ పండితులు శుక్రవారం కపిలగోవుకు పూజలు చేశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన దాదాపు 30మంది పురాణ పండితులను పర్మినెంట్ చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో కామితార్థ ఫల దీక్షకై గోపూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా వీరి పోరాటానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వి.నాగేశ్వరరావు, చిత్తూరు జానపద కళాకారుల సంఘం, ప్రత్యేక ప్రతిభావంతులు తమ మద్దతును ప్రకటించారు.

‘సాక్షి’ ప్రసారాలు నిలిపివేశాం

విశాఖపట్నం, జూన్ 10:‘సాక్షి’ ఛానెల్ రెచ్చగొట్టే వార్తలను ప్రసారం చేస్తూ ఉద్రిక్తతలను మరింత పెంచుతోందని, ఆ కారణంగా ఆ ఛానెల్ ప్రసారాలను నిలిపివేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపు ఉద్యమనేత ముద్రగడ దీక్షకు సంబంధించి సాక్షి టీవీ చేసిన ప్రసారాలు ఆయా సామాజికవర్గాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నారు. దీనివల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాకూడదని ముందు జాగ్రత్త చర్యగా ప్రసారాలు నిలిపివేసినట్టు చెప్పారు. కాపుజాతి కోసం ముద్రగడ చేస్తున్న దీక్షపై గంటా తీవ్రంగా స్పందించారు.

నంద్యాల - ఎర్రగుంట్ల మధ్య త్వరలో రైళ్ల రాకపోకలు

నందలూరు, జూన్ 10:సెప్టెంబర్‌లో నూతనంగా నంద్యాల - ఎర్రగుంట్ల రైలుమార్గంలో నూతనంగా రైళ్ల రాకపోకలు సాగించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే యూజర్స్ కమిటీ సభ్యులు బూసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌ను మాడల్ రైల్వేస్టేషన్‌గా తీర్చేందుకు రైల్వే శాఖ సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. ఈ నెల 7న గుంతకల్‌లో జరిగిన డిఆర్‌యుసిసి సమావేశంలో రైల్వే ఉన్నతాధికారులు ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ అభివృద్ధిపై చర్చించారన్నారు. రాజంపేట, రైల్వేకోడూరులో ఆర్‌యుబిల నిర్మాణంకు అధికారులు హామీ ఇచ్చారన్నారు.

చక్కెర ఫ్యాక్టరీకి తాళాలు!

చెన్నూరు,జూన్ 10: జిల్లాలో ఏకైక సహకార చక్కెర కర్మాగార ఫ్యాక్టరీ ఈనెల 30న పూర్తిస్థాయిలో మూసివేసి జిల్లా అధికారుల చేతుల్లోకి రానుంది. ఇప్పటి వరకు ఫ్యాక్టరీకి ఇన్‌చార్జ్ ఎండిగా రవికుమార్ కొనసాగుతున్నారు. ప్రస్తుతం సీజనల్ కార్మికులు 15 మంది ఫ్యాక్టరీ చుట్టు సెక్యురిటీ కాపలా ఉన్నారు. అలాగే ఎండి కార్యాలయంలో కొంతమంది సిబ్బంది ఉన్నారు. వీరందరూ ఈనెల 30వ తేదీ నుంచి ఫ్యాక్టరీ మూసివేస్తే బయటకు పంపించే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. గతనెల చివరిలో జిల్లా కలెక్టర్ ఇన్‌చార్జ్ ఎండితోపాటు పలువురు సిబ్బంది ఫ్యాక్టరీ పరిస్థితిపై చర్చించారు.

Pages