25వేల రియాల్స్కు నన్ను అమ్మేశారు
Published Saturday, 11 June 2016హైదరాబాద్, జూన్ 10: పేదరికం ఆమె పాలిట శాపమైంది. భర్త ఆకస్మిక మరణంతో రోడ్డున పడిన కుటుంబాన్ని పోషించుకోవటం కోసం పరిచయస్తులను ఆశ్రయిస్తే ఏకంగా సౌదీ అరేబియాకు అమ్మేశారంటూ నగరానికి చెందిన బాధిత మహిళ కంట తడిపెట్టింది. సౌదీ అరేబియాలో కుట్టు, ఎంబ్రాయిడరీ, మెహందీ.. ఇలా ఇతర పనుల కోసం సౌదీ అరేబియా వెళ్లిన 18మంది మహిళలను అక్కడ షేక్ల వేధింపులకు గురి చేశారు. షేక్ల వేధింపుల నుంచి చాకచాక్యంగా తప్పించుకుని భారత రాయబార కార్యాలయం సహకారంతో స్వదేశానికి చేరుకున్నారు బాధిత మహిళలు.