కొత్త శకానికి నాంది
Published Thursday, 9 June 2016వాషింగ్టన్, జూన్ 9: భారత్-అమెరికా సహజ మిత్రులని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న మైత్రి ఉన్నత శిఖరాలకు చేరిందని ఆయన వెల్లడించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, వ్యాపార, వాణిజ్య సంబంధాలు ప్రభావవంతమైనవని ఆయన స్పష్టం చేశారు. యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో బుధవారం రాత్రి ఆయన ప్రసంగించారు. భారత్-అమెరికాల సంబంధాల్లో కొత్తశకం ప్రారంభమైందని ఆయన తెలిపారు. ఇరుదేశాల ప్రయోజనాలు కాపాడుకోవడంతోపాటు ప్రపంచానికే ఆదర్శంగా మారిందని ఆయన అన్నారు.