పెండింగ్ ఫైల్స్ను సత్వరం పరిష్కరించాలి
Published Thursday, 9 June 2016విజయనగరం(టౌన్), జూన్ 9: ఆక్రమణ, అన్యక్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములు, సామాజిక భూముల వివరాలను సత్వరమే గుర్తించి నివేదికలు సమర్పించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ ఆదేశించారు. గురువారం జిల్లా జిల్లా కలెక్టర్ సమావేశ భవనంలో రెవెన్యూ డివిజన్ అధికారులు, తహశీల్దార్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములు, చెరువులు, సామాజిక స్థలాలు అన్యాయాక్రాంతం, ఆక్రమణలకు గురైనవాటి వివరాలు నివేదించాలని చెప్పారు. ప్రభుత్వ భూములు పరిరక్షణకు తహశీల్దార్లు చర్యలు చేపట్టి ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.