కొత్త రేషన్ షాపులకు పచ్చజెండా!
Published Friday, 10 June 2016మచిలీపట్నం, జూన్ 9: జిల్లాలో రేషన్ దుకాణాల సంఖ్య పెరగనుంది. నిత్యావసర సరుకుల పంపిణీని మరింత వేగవంతం చేసేందుకు జిల్లాలో 206 దుకాణాలను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. బందరు డివిజన్లో 27 దుకాణాలు, గుడివాడ డివిజన్లో 32, నూజివీడు డివిజన్లో 39, విజయవాడ డివిజన్లో 108 దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 2161 చౌక ధర దుకాణాల ద్వారా 13లక్షల 70వేల మంది కార్డుదారులకు నిత్యావసర వస్తువుల పంపిణీ జరుగుతోంది. ఇకపై రేషన్ షాపుల సంఖ్య 2367 కానుంది. ప్రతి 500 కార్డులకు ఒక రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేసి సరుకుల పంపిణీని వేగవంతం చేయాలనేది ప్రభుత్వ ఆలోచన.