పరిసరాలు పరిశుబ్రంగా ఉంచుకుంటే అంటువ్యాధులు దూరం
Published Thursday, 9 June 2016ఆసిఫాబాద్, జూన్ 9: వర్షాకాలంలో ప్రబలే అంటువ్యాధులను అరికట్టేందుకు పరిసరాల పరిశుభ్రతంగా ఉండేలా చూసుకోవాలని జిల్లా మలేరియా అధికారి అల్హం రవి పేర్కొన్నారు. గురువారం ఆసిఫాబాద్ క్లస్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అడ, కెరమెరి, వాంకిడి, రెబ్బెన పిహెచ్సిన పర్యవేక్షక సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరు స్థానికంగా ఉండాలని సూచించారు. వ్యాధులకు కారణమైన దోమలను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఇండ్ల చుట్టు మురికి గుంతలు ఉండకుండా, వర్షపునీరు నిలవకుండా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.