టిడిపి ప్రజలను మోసం చేస్తోంది
Published Friday, 10 June 2016భీమవరం, జూన్ 9: టిడిపి ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలుచేసి ప్రజలను మోసం చేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు విమర్శించారు. కేవలం పదవుల కోసమే బిజెపితో పొత్తు పెట్టుకుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా చేపల చెరువుల తవ్వకాలు ఇష్టానుసారంగా జరుగుతున్నాయని, వీటిని అడ్డుకుంటామని ప్రకటించారు. వీటివల్ల పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. గురువారం భీమవరంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉండి మండలం యండగండి గ్రామంలో మూడు పంటలు పండే సారవంతమైన 200 ఎకరాల ఆయకట్టు ఉందని, దీని మధ్యలో 30 ఎకరాల్లో కొంతమంది అనుమతులు లేకుండా చేపల చెరువులు తవ్వుతున్నారన్నారు.