వృద్ధికి పెట్టుబడులే కీలకం
Published Thursday, 9 June 2016న్యూఢిల్లీ, జూన్ 8: వేగవంతమైన వృద్ధికి ప్రైవేట్రంగ పెట్టుబడులు చాలా అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. వేగవంతమైన వృద్ధిని అందుకునే సామర్థ్యం భారత్కుందన్న ఆయన వాస్తవ జిడిపి గణాంకాలు ఒక శాతం ఎక్కువగానో, తక్కువగానో ఉండొచ్చన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో భారత జిడిపి వృద్ధిరేటు 7.6 శాతంగా నమోదైనట్లు ఇటీవల ప్రకటించినది తెలిసిందే. ప్రపంచంలోని ప్రధాన దేశాల్లో ఇదే అత్యధికమని కూడా కేంద్రం చెప్పుకొచ్చింది.