తుని విధ్వంసాన్ని ఆ కోణంలో చూడొద్దు..
Published Wednesday, 8 June 2016రాజమండ్రి: కాపుగర్జన సందర్భంగా ఇటీవల తుని వద్ద జరిగిన విధ్వంసకాండను నేరంగా చూడరాదని, అది జనసమూహం చేసిన చర్య అని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ ఉద్యమానికి జనం మద్దతు ఉందన్నారు. వైకాపాను లక్ష్యంగా చేసుకుని తుని విధ్వంసకాండలో అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. కాపు కులానికి చెందిన రాష్ట్ర మంత్రి నారాయణ తన విద్యాసంస్థల్లో కాపు విద్యార్థులకు ఎలాంటి రాయితీలిస్తున్నారో ప్రకటించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.