దేశ చరిత్రను తిరగరాశాం
Published Wednesday, 8 June 2016విజయవాడ, జూన్ 7: దశాబ్దకాలం పాటు అవినీతి.. కుటుంబ పాలన.. స్వప్రయోజనలతో దేశాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ పాలన నుండి నేడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా బిజెపి ప్రభుత్వం పటిష్ఠ అవినీతి రహిత పాలనను అందిస్తోందని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతీఇరానీ పేర్కొన్నారు. కేంద్రం ఖర్చు చేసే ప్రతీ పైసా పేదవాడి దరి చేరేందుకు గాను కేంద్రం స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు పోతోందన్నారు. దేశంలో పోర్టులు... రహదారులు... ఎయిర్పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా ప్రగతిని సాధించి మెరుగైన వృద్ధిరేటును నేడు సాధించుకోగలుగుతున్నామన్నారు.