వటపత్రశాయి
Published Thursday, 9 June 2016ఒకనాడు మార్కండేయ మహర్షి నారాయణమూర్తినుద్దేశించి ‘‘దేవా నీవు మాయాస్వరూపుడవు. నీ మాయను కళ్ళారా చూచుటకు వేడుక పడుతున్నాను. నన్ను కృతార్థుడను చేయుము’’ అనగా పరమాత్ముడు అట్లేకానిమ్ము అని పలుకుచూ బదరికాశ్రమమునకు తరలివెళ్ళెను. శ్రీ మార్కండేయుడప్పటినుండి భగవంతుని మాయను దర్శించుట ఏనాడో కదా అని వ్యాకుల మనస్కుడాయెను.