కుటుంబ పాలన సాగుతోంది
Published Thursday, 9 June 2016ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలో తెలంగాణలోకుటుంబ పాలన సాగుతున్నది. మంత్రులూ ప్రేక్షకులే. ఎవరికీ అధికారాలు లేవు. మొత్తం వ్యవస్థను కెసిఆర్ తన గుప్పిట్లో పెట్టుకుని పాలన సాగిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ ఇలా వివిధ కీలకమైన శాఖలన్నింటినీ తమ ఆధీనంలో పెట్టుకుని పాలన చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, తనయుడు కె. తారక రామారావు కలిసి అధికారులను శాసిస్తున్నారు. కుటుంబానిదే పెత్తనం. రాజ్యాంగాన్ని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం, అపహాస్యం చేశారు. మెజారిటీ ఉన్న టిఆర్ఎస్ను కూల్చివేసే సత్తా విపక్షాలైన కాంగ్రెస్, బిజెపి, టిడిపిలకు లేదు. అయినా విపక్షాల అంటే ఎందుకో కెసిఆర్కు భయం.