విభజనతో వీధిన పడ్డారు!
Published Wednesday, 8 June 2016విశాఖపట్నం, జూన్ 7: రాష్ట్ర విభజనతో మూడు కళాశాలలకు చెందిన ఆర్కిటెక్చర్ విద్యార్థులు రోడ్డున పడ్డారు. వీటికి హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జెఎన్ఎఎఫ్యు) అనుబంధ కళాశాలల గుర్తింపును రద్దు చేయడంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దాదాపు ఆరు నెలలుగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోని నరవలో ఉన్న వరహా కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, విజయవాడ, భీమవరంలోని ఆర్కిటెక్చర్ కోర్సు నిర్వహిస్తున్న కళాశాలలు ఉమ్మడి రాష్ట్రంలో అనుబంధ కళశాలలుగా కొనసాగాయి.