కేరళను తాకిన రుతుపవనాలు..
Published Wednesday, 8 June 2016తిరువనంతపురం: వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగానే నైరుతి రుతుపవనాలు బుధవారం కేరళ తీరాన్ని తాకాయి. దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించిన రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, నాలుగైదు రోజుల్లో ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.