కోవూరు పరిధిలో వ్యక్తి హత్య
Published Wednesday, 8 June 2016నెల్లూరు, జూన్ 7: ఇష్టారీతిగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ తనపై పనిచేసే వ్యక్తిని మరో వ్యక్తి హత్య చేసిన ఘటన కోవూరు పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు కోవూరు పట్టణ సమీపంలో జాతీయ రహదారిపై ఓ హోటల్లో ఇస్మాయిల్ (32) చీఫ్ వంటమాస్టర్గా పని చేస్తున్నాడు. ఇతనిది చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం. తన కింద పనిచేసే సిబ్బంది పట్ల ఇస్మాయిల్ తరచూ దురుసుగా ప్రవర్తించేవాడు. అదేవిధంగా టిపి గూడూరు మండలం ఈదూరు గ్రామానికి చెందిన చెంగల్రాయుడు అనే వ్యక్తి అదే హోటల్లో సర్వర్గా పని చేస్తున్నాడు. ఈనేపథ్యంలో ఇస్మాయిల్ తరచూ చెంగల్రాయుడిని ఇబ్బందులకు గురిచేసేవాడు.