మూడు గ్రామాల్లో స్వచ్ఛంద బంద్
Published Wednesday, 8 June 2016ప్రత్తిపాడు, జూన్ 7: తుని ఘటనలకు సంబంధించి అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని, లేకుంటే తనను కూడా అరెస్టు చేయాలని ఉద్యమించిన ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా మంగళవారం కిర్లంపూడి, జగపతినగరం, చిల్లంగి మూడు గ్రామాల్లో ఉదయం నుండి రాత్రి వరకు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. కిర్లంపూడి గ్రామంలోకి ఎవరూ ప్రవేశించకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటులచేశారు. సామర్లకోట - ప్రత్తిపాడు మధ్య మంగళవారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయి రవాణా స్తంభించింది.