హైటెక్ మోసం
Published Wednesday, 8 June 2016ముండ్లమూరు, జూన్ 7 : మండలంలోని సుంకరవారిపాలెం గ్రామానికి చెందిన చిట్టిబోయిన గురుప్రసాద్ బ్యాంకు ఖాతా నుండి మంగళవారం ఏడువేల రూపాయల నగదును గుర్తుతెలియని వ్యక్తులు డ్రాచేసుకున్నట్లు బాధితుడు ముండ్లమూరు పోలీసులకు తెలిపారు. బాధితుని కథనం మేరకు గురు ప్రసాద్కు మారెళ్ళ సిండికేట్ బ్యాంకులో ఖాతా ఉంది.