అభినవ అశోకుడు చంద్రబాబు
Published Wednesday, 8 June 2016మంగళగిరి, జూన్ 7: రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన సాగుతోందని , రెండేళ్లుగా చంద్రబాబు శ్రామికుడిగా తీరిక లేకుండా శ్రమిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్బాబు అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నవ నిర్మాణదీక్ష వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక అధికారి నాగశివరావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి కిషోర్బాబు ప్రసంగిస్తూ ఐదుకోట్ల మంది ప్రజలు సుభిక్షంగా ఉండాలని, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్వన్గా చేయాలని, అశోక్ చక్రవర్తి పాలన స్ఫూర్తిగా పనిచేస్తున్న చంద్రబాబు అభినవ అశోకుడని అన్నారు.