బతుకు బస్టాండే! (తరలింపు తిప్పలు - 3)
Published Wednesday, 8 June 2016విజయవాడ, జూన్ 7: రాష్ట్ర విభజన కార్చిచ్చు ప్రభుత్వోద్యోగుల మెడకు పామైచుట్టుకుంది. ఉద్యోగుల సంసారాలను నిలువునా చీల్చేసింది. విభజన తరువాత కొత్త రాజధాని ఎక్కడ ఏర్పడితే అక్కడికి తరలి వెళ్లిపోవాలన్న విషయం ఉద్యోగులకు తెలియంది కాదు. ఇందుకు చాలామంది ఉద్యోగులు మానసికంగా సిద్ధపడ్డారు కూడా. కాకపోతే దాని తీవ్రత ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. తరలింపు వ్యవహారం కుటుంబాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితిని తెస్తోంది. అలాగే అధికారుల మధ్య సమన్వం లేకపోవడం, ఎంసెట్ కౌన్సిలింగ్ మొదలైనా స్థానికత అంశం తేలకపోవడంతో తరలిరావల్సిన ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారు.