ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల్లో అరుంధతీ భట్టాచార్య
Published Wednesday, 8 June 2016ముంబయి, జూన్ 7: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య.. ఆర్థిక రంగంలో ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఐదో స్థానంలో నిలిచారు. నిరుడుతో పోల్చితే ఈసారి భట్టాచార్య ఐదు స్థానాలు ఎగబాకడం గమనార్హం. ఇక ప్రపంచంలో వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల్లో భట్టాచార్య ఐదో స్థానంలో ఉన్నారని ఓ ప్రకటనలో మంగళవారం ఎస్బిఐ చెప్పింది. ఈ జాబితాలో రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక, శాస్త్ర, పెట్టుబడుల, దాతృత్వ విభాగాలకు చెందిన మహిళలున్నారు. సిఇఒలు కూడా ఉన్నారు. 200 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన ఎస్బిఐకి సారథిగా ఉన్న భట్టాచార్య..