పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం
Published Wednesday, 8 June 2016పెద్దకడబూరు, జూన్ 7: మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో మంగళవారం ఎఓ హేమలత అనుమానం ఉన్న ఇండ్లపై దాడులు నిర్వహించారు. జాలవాడి గ్రామానికి చెందిన అల్లిపీరా ఇంట్లో పౌండేషన్ పత్తి విత్తనాలు 10 ప్యాకెట్లు, బయోకంపెనీ పత్తివిత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫౌండేషన్ విత్తనాలను సాగు కోసం కంపెని వారు అందజేశారని రైతు అల్లిపీరా ఎఓ దృష్టికి తెచ్చారు. అయితే ఎఓ హేమలత మాట్లాడుతూ పత్తి విత్తన ప్యాకెట్లపై విచారణ చేసి ఆయా కంపెని వారీతో మాట్లాడి నాణ్యమైన విత్తనాలు అయితే రైతుకు అందజేస్తామని, నకిలీ అయితే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.