ఉద్యోగం పేరిట మోసం
Published Wednesday, 8 June 2016పాయకాపురం, జూన్ 7: ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఒక మహిళ నుండి లక్షల రూపాయలు తీసుకుని మోసగించిన వ్యక్తులపై నున్న గ్రామీణ పోలీసు స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాయకాపురంలో నివాసముంటున్న మల్లాదికుమారి కుమారుడు నాగేంద్రబాబు నగరంలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి కండ్రికలోని మహేష్రాజు అనే స్నేహితుడు ఉన్నాడు. తనకు తెలిసిన వ్యక్తులు ఉన్నారని, వారి ద్వారా విటిపిఎస్లో ఉద్యోగాలు పొందవచ్చని మహేష్రాజు చెప్పడంతో అతని మాటలు నమ్మిన నాగేంద్రబాబు ఆ విషయాన్ని తన తల్లికి చెప్పాడు.