ఎఇఎఫ్డిఎస్ విధానంలో ఎరువుల పంపిణీ
Published Wednesday, 8 June 2016విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 7: దేశంలోనే ప్రప్రథమంగా ఎరువుల వినియోగ క్రమబద్ధీకరణ విధానంలో పైలెట్గా ఎంపికైన కృష్ణా జిల్లాలో జూన్ 2వ వారంలో జిల్లాలోని 1100 ఎరువుల దుకాణాల్లో అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. మంగళవారం ఆధార్, ఆధారిత, ఎలక్ట్రానిక్ మేనేజ్మెంట్ విధానంలో ఎరువుల పంపిణీపై జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు, సబ్ కలెక్టర్ డా.జి.సృజన, వ్యవసాయశాఖ డిడి ఎన్.బాలూనాయక్, ఎన్ఐసి అధికారి శర్మ, డిడిఓ అనంత్, తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎరువుల వినియోగాన్ని ఆయా ప్రాంతాల, పంటల ఆధారంగా సక్రమంగా వాడాల్సిన ఆవశ్యకత వుందన్నారు.