ద్విచక్ర వాహనం బోల్తా...
Published Wednesday, 8 June 2016వజ్రకరూరు, జూన్ 7 : ద్విచక్ర వాహనం బోల్తా పడి మండల పరిధిలోని చిన్నఓతూరు గ్రామానికి చెందిన బోయ నారాయణస్వామి (42) అక్కడికక్కడే మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల మేరకు లారీ డ్రైవర్గా పని చేస్తున్న నారాయణ స్వామి ఉరవకొండలో విధులు ముగించుకుని వస్తుండగా గ్రామ సమీపంలో బోల్తా పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎస్సై జనార్దన్నాయుడు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.