‘పోలవరం’ పరిశీలించిన సిడబ్ల్యుసి డైరెక్టర్లు
Published Wednesday, 8 June 2016పోలవరం, జూన్ 7: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పెరుగుతున్న అంచనాలు, సమస్యలు తెలుసుకోవడానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆదేశాల మేరకు వచ్చినట్టు సిడబ్ల్యుసి డైరెక్టర్లు వీరేంద్రశర్మ, ప్రమోద్ నారాయణలు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం వచ్చిన డైరెక్టర్లు కాంట్రాక్టు ఏజెన్సీ క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు, కుడి కాలువ, ఆర్ఆర్ ప్యాకేజీ అమలు విషయాలను పవర్ ప్రజెంటేషన్ ద్వారా కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధి సత్యంబాబు వివరించారు.