ఆర్యుబి వలన నష్టం జరుగకుండా చూస్తా
Published Wednesday, 8 June 2016కొత్తవలస, జూన్ 7: కొత్తవలస జంక్షన్ వద్ద ఉన్న రైల్వే గేటు సమస్య నుండి బయట పడేందుకు రెండు రోజుల క్రితం రైల్వే అధికారులు ఆర్యుబి నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. కొత్తవలస-అరకు రోడ్డును ఆనుకుని ఉన్న రైల్వే షాపుల వద్ద ఉన్న గెడ్డ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం సుమారు 40 షాపులకు చెందిన వ్యాపారులు ఆర్యుబి వలన ఉపాధి కోల్పోతామని, కుటుంబాలన్నీ రోడ్డున పడతాయని చెబుతూ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికి మొరపెట్టుకున్నారు. దీంతో ఆమె స్పందిస్తూ ఆర్యుబి ప్రతిపాదనలు తమకు తెలియవని, స్థలపరిశీలన జరిగినట్లు తమ దృష్టికి రాలేదని చెప్పారు.