అమరులను మరువొద్దు
Published Tuesday, 7 June 2016హైదరాబాద్, జూన్ 6: అమరవీరుల త్యాగాలు నిత్య స్మరణీయాలని, ఆటుపోట్లతో ఉద్యమం మొదలై ఆత్మహత్యలు చేసుకుంటేనేకానీ రాష్ట్రావతరణకు అంకురార్పణ జరగలేదని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ప్రతిపక్షాలు ముసలి కన్నీరు కారిస్తే సరిపోదని అమరవీరుల కుటుంబాలను మర్చిపోకూడదని సూచించారు. రవీంద్రభారతిలో సోమవారం తేజ ఆర్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో బైసా దేవదాసు ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న తెలంగాణ అమరవీరుల స్మృతి కవితా సంకలనం ‘అక్షర నివాళి’ పుస్తకావిష్కరణకు అల్లం నారాయణ అధ్యక్షత వహించారు.