హోరెత్తిన పోడు పోరు
Published Tuesday, 7 June 2016భద్రాచలం, జూన్ 6: బంగారు తెలంగాణ అంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్న కెసీఆర్ బంగారు పంజరంలో ఈ తెలంగాణ బందీగా మారిందని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం గిరిజనులు ఐటీడీఏను ముట్టడించారు. భారీ ధర్నా నిర్వహించారు. సుమారు 5వేల మంది గిరిజనులతో భద్రాచలం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ వద్దకు చేరుకుని ముట్టడించారు. ఐటీడీఏ ముందు బైఠాయించిన సీపీఐ శ్రేణులు, గిరిజనులు చేసిన నినాదాలతో భద్రాద్రి హోరెత్తింది.