రేపు మహా సంకల్పం
Published Tuesday, 7 June 2016కాకినాడ, జూన్ 6: నవ నిర్మాణ దీక్షలో భాగంగా ఈ నెల 8న జిల్లా స్థాయిలో మహాసంకల్పం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ హనుమంతు అరుణ్కుమార్ చెప్పారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్లోని కోర్టు హాలులో వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. నవనిర్మాణ దీక్ష సందర్భంగా వివిధ శాఖల ప్రగతిని సూచించే ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. సంకల్ప సభకు జిల్లాలోని జన్మభూమి కమిటీ సభ్యులందరూ హాజరవుతారన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సహా జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్టు తెలిపారు.