జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం
Published Tuesday, 7 June 2016చీరాల, జూన్ 6: జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి శిద్దారాఘవరావు హామీ ఇచ్చారు. చీరాల్లో నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్ష ఆరో రోజు కార్యక్రమంలో మరో రాష్ట్ర మంత్రి రావెల కిషోర్బాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా, జపాన్ దేశాలకు చెందిన కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ఇప్పటికే రూ. 42వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.